శంకర్పల్లి రూరల్, జూలై 15 : ప్రైవేట్కు దీటుగా జన్వాడ ప్రభుత్వ పాఠశాలను కేటీఆర్ నిర్మించారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం జన్వాడలో సీఎస్ఆర్ సహకారంతో మాజీ మంత్రి కేటీఆర్ రూ. 5 కోట్లతో నిర్మించిన నూతన పాఠశాల భవనాన్ని ఆమె పర్యవేక్షించి మాట్లాడారు. పదవిలో లేకున్నా అడగగానే పాఠశాలకు నిధులు మాంజూరు చేసిన మాజీ మంత్రి కేటీఆర్కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. సీఎం రేవంత్ తెలంగాణలో 4 వేల పాఠశాలలను మాత్రమే నడుపుతామనడం సమంజసం కాదని, రాష్ట్రంలోని 26 వేల ప్రభుత్వ పాఠశాలలను నడపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇండస్ స్కూల్ యాజమాన్యం జన్వాడ పాఠశాలలో ఉన్నతస్థాయి విద్యను అందిచడంకోసం ముందుకురావడం అభినందనీయమని కొనియాడారు.