Sampath Reddy | జనగామ జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్రెడ్డి కన్నుమూశారు. ఆయన గుండెపోటుకు గురి కాగా.. హనుమకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సంపత్రెడ్డి జనగామ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. సోమవారం సాయంత్రం సమయంలో సంపత్రెడ్డి గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలారు. దీంతో కుటుంబ సభ్యులను ఆయనను హనుమకొండలోని రోహిణి ఆసుపత్రికి తరలించారు.
చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల జరిగిన బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు. సంపత్ రెడ్డి మృతితో కార్యకర్తలు, అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు. సంపత్రెడ్డి మృతిపై బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు సంతాపం వ్యక్తం చేశారు. ఉద్యమం నుంచి సంపత్రెడ్డి తన వెంటనడిచారని.. ఆయన మృతి బాధాకరమన్నారు. సంపత్రెడ్డి కుటుంబానికి సానుభూతి ప్రకటించిన కేసీఆర్.. బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.