(రంగారెడ్డి, సెప్టెంబర్ 7 నమస్తే తెలంగాణ) : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అద్భుతమని, ఇతర రాష్ర్టాలకూ ఆదర్శనీయమని జమ్ముకశ్మీర్ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కొనియాడారు.
అధ్యయనంలో భాగంగా బుధవారం వారు ఖైరతాబాద్లోని జిల్లా పరిషత్ కార్యాలయంలో రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డితో సమావేశమయ్యారు.