హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ): ఎమ్మె ల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలను బీసీలకే కేటాయించాలని కాంగ్రెస్ను బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
కాంగ్రెస్.. ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గానికి 2 చొప్పున 34 అసెంబ్లీ స్థానాలను బీసీలకు కేటాయిస్తామని గత ఎన్నికల్లో హామీ ఇచ్చిందని, చివరకు 22 స్థానాలతోనే సరిపెట్టిందని గుర్తుచేశారు.