జహీరాబాద్, నవంబర్ 23: ఇంటి మ్యుటేషన్ కోసం రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ మున్సిపల్ కమిషనర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. మెదక్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణానికి చెందిన ఎండీ నిసారుద్దీన్ మూసానగర్లోని తన ఇంటి మ్యుటేషన్ కోసం మున్సిపల్ కార్యాలయానికి వెళ్లగా కమిషనర్ సుభాష్రావు దేశ్ముఖ్, మేనేజర్ మనోహర్ రూ. 3 లక్షలు డిమాండ్ చేసి, రూ.2.50 లక్షలకు అంగీకరించారు.
బుధవారం మున్సిపల్ కార్యాలయంలో అటెండర్ రాకేశ్.. నిసారుద్దీన్ నుంచి రూ.2 లక్షలు తీసుకొంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న కమిషనర్ సుభాష్రావు దేశ్ముఖ్, మేనేజరు మనోహర్, అటెండర్ రాకేశ్ను అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరిచినట్టు ఏసీబీ డీఎస్పీ తెలిపారు.