Minister Koppula Eshwar | జగ్జీవన్రామ్ జీవితం స్ఫూర్తిదాయకమని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఏప్రిల్ 5న బాబు జగ్జీవన్రామ్ 116వ జయంతి ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్లను మంత్రి హైదరాబాద్లోని క్యాంప్ కార్యాలయంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగ్జీవన్ రామ్ పేరొందిన స్వాతంత్య్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త అన్నారు. ఆయన సేవలు దేశానికి ఆదర్శమని, దళితుల కోసం పోరాడారన్నారు.
దళితుల కోసమే బతికారని, చివరి శ్వాస వరకు ప్రజాసేవలో తరించిన జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకమన్నారు. భారత ప్రజలకు లభించిన అమూల్య రత్నమన్నారు. స్వతంత్ర భారత్ను ఈ దేశ సామాజిక స్థితిగతులకు సరిపోయేలా తీర్చిదిద్దడంలో బాబు జగ్జీవన్ రామ్ కృషి ఎంతో ఉందన్నారు. ఆయన దళితుల కోసం చేసిన సేవలు మరువలేనివని అన్నారు. స్వాతంత్ర సమరయోధుడిగా, సంఘ సంస్కర్తగా, ప్రజా నాయకుడిగా జగ్జీవన్ రామ్ ప్రజలకు ఎప్పుడు గుర్తు ఉండిపోతారన్నారు.