హైదరాబాద్ : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha)తో బీఆర్ఎస్ పార్టీకి చెందిన జగిత్యాల(Jagithyala) కౌన్సిలర్లు(,BRS councilors) మంగళవారం హైదరాబాద్లో భేటీ అయ్యారు. వైస్ చైర్మన్పై కౌన్సిలర్లు అవి శ్వాస తీర్మానం పెట్టిన నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ ఎల్ రమణ నేతృత్వంలో కౌన్సిలర్లు ఎమ్మెల్సీ కవితతో కీలక మంతనాలు జరిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ..పార్టీ అందరికీ అవకాశాలు ఇచ్చిందని, భవిష్యత్తులోనూ సమానావకాశాలు కల్పిస్తుందని తెలిపారు. రానున్న కాలంలో పార్టీ మరింత బలోపేతమై ప్రజల ఆశీర్వాదాన్ని సంపాదిస్తుందన్న విశ్వాసం ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీ అంటేనే క్రమశిక్షణకు మారుపేరని స్పష్టం చేశారు.
అధికార పార్టీ చేస్తున్న ప్రజా వ్యతిరేక చర్యలపై గట్టిగా పోరాటం చేయాల్సిన ఈ తరుణంలో అందరూ కలిసికట్టుగా ప్రయాణం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కాబట్టి అవిశ్వాస తీర్మానంపై పునరాలోచన చేయాలని సూచించారు. దాంతో ఎమ్మెల్సీ కవిత సూచన మేరకు అవిశ్వాస తీర్మానంపై వెనక్కి తగ్గాలని కౌన్సిలర్లు అక్కడికక్కడే నిర్ణయం తీసుకున్నారు. బుధవారం అవిశ్వాస తీర్మానంపై జరగబోయే ఓటింగ్లో పాల్గొనబోమని కౌన్సిలర్లు ప్రకటించారు.