సీఎల్పీ సమావేశాన్ని బహిష్కరించిన వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
హైదరాబాద్, మార్చి 6 : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ప్రొటోకాల్ పాటించడం లేదని, తాను ఇంచార్జిగా ఉన్న మెదక్ జిల్లాలో పర్యటించినా సమాచారం ఇవ్వకుండా అవమానిస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. తనకు జరుగుతున్న అవమానాలపై సీఎల్పీలో మాట్లాడొద్దని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సూచించడంతో సమావేశాన్ని బహిష్కరించినట్టు చెప్పా రు. తన సమస్యలు చెప్పుకొనేందుకు అవకాశం ఇవ్వని సమావేశంలో తాను ఉండదల్చుకోలేదని పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్లోని తాజ్ డెక్కన్ హోటల్లో నిర్వహించిన సీఎల్పీ భేటీ నుంచి ఆయన మధ్యలోనే వెళ్లిపోయారు.