హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): దళిత ఎమ్మెల్యే బాల్క సుమన్పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దళిత యువ నేత రాజకీయ ఎదుగుదలను ఓర్చుకోలేని ఆయన అవమానించేలా మాట్లాడారు. ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్ గాంధీ సభ పెట్టడంపై స్పందించిన బాల్క సుమన్.. ముందుగా రాహుల్ గాంధీ తెలంగాణ సమాజానికి, అమరవీరుల కుటుంబాలకు క్షమాపణ చెప్పిన తర్వాతే సభ పెట్టాలని డిమాండ్ చేశారు. బాల్క సుమన్ వ్యాఖ్యలపై స్పందించిన జగ్గారెడ్డి.. దళిత ఎమ్మెల్యే అని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. బాల్క సుమన్కు ఎమ్మెల్యేగా ఉండే అర్హత లేదనే విధంగా మాట్లాడడం గమనార్హం. రాష్ట్రం వచ్చింది కాబట్టి ఎమ్మెల్యే అయ్యాడని, లేదంటే వార్డు మెంబర్గా కూడా గెలవలేడంటూ అవమానకరంగా మాట్లాడారు. తెలంగాణ తెచ్చుకున్నదే బడులు, బలహీన వర్గాలకు కూడా రాజకీయ అధికారం దక్కాలనే కదా..? ఇది మరిచిన జగ్గారెడ్డి మొత్తం దళితులను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.