యాదాద్రి భువనగిరి : అధికారం ఉందని రెచ్చిపోతే రాజకీయంలో కనుమరుగు అవుతారని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్రెడ్డి(Jagadish Reddy) అన్నారు. శుక్రవారం భువనగిరి (Bhuvanagiri) అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..భువనగిరికి నాకు విడదీయలేని సంబంధం ఉందన్నారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఏం చేశారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతున్నదని పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలు పెట్టి ప్రతిపక్షం అడిగిన ప్రశ్నలుకు సమాధానం చెప్పలేని పరిస్థితిలో కాంగ్రెస్ ఉందని ఎద్దేవా చేశౠరు. అసెంబ్లీలో బొక్కబోర్లా పడ్డారు.. రైతుబంధు అడిగితే చొప్పుతో కొట్టండని మంత్రి కోమటిరెడ్డి అహంకారపూరితంగా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. పని చేయడానికి ప్రజలు మీకు అధికారం ఇచ్చారు.
వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి గతంలో ఒకరు వైఎస్సార్, మరొకరు చంద్రబాబు బూట్లు తుడిచే వారని ఘాటుగా విమర్శించారు. మీరు ఇట్లనే మాట్లాడితే ప్రజలు మిమ్మల్ని బొంద్దపెడుతారని హెచ్చరించారు. ప్రజలు వచ్చే ఎన్నికలో మళ్లీ బీఆర్ఎస్ పార్టీని గెలిపించాడనికి సిద్ధంగా ఉన్నారు. ఎవరు అధైర్య పడొద్దు అధికారం మనదేనని కార్యకర్తలకు భరోసానిచ్చారు.