నవంబర్ 28 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ(ఞానలయంలయల)కు వాతావరణ శాఖ అధికారులు మరోసారి వర్ష(Rains) హెచ్చరిక జారీ చేశారు. రానున్న నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. బంగా ళాఖాతంలోని (Bay of Bengal) దక్షిణ అండమాన్ సమీపంలోని మలక్కా జలసంధిలో సోమవారం అల్పపీడనం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇది బుధవారం పశ్చిమ వాయవ్య దిశగా పయనించి ఆగ్నేయ బంగాళాఖాతంలో తుఫాను(storm)గా మారనున్నట్లు వెల్లడించారు.
ఆ తర్వాత వాయవ్య దిశగా పయనించి 48 గంటల్లో తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో రానున్న నాలుగు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ముఖ్యంగా భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సిరిసిల్ల, జనగామ, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావారణ శాఖ అధికారులు వెల్లడించారు.
ఏపీలోని అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశముందని చెప్పారు. రాష్ట్రంలో దిగువ ట్రోపో ఆవరణలో తూర్పు గాలులు వీస్తున్నాయని, వీటి ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు.