హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో రెండు రోజులుగా జరిగిన ఐటీ సోదాలు బుధవారంతో ముగిశాయి. ప్రముఖ ఫార్మా కంపెనీ చైర్మన్ నివాసంతోపాటు సీఈఓ, ఎండీ, ఇతర ఉద్యోగుల నివాసాల్లో సోమవారం నుంచి ఏక కాలంలో తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో ప్రదీప్రెడ్డి, నరేందర్రెడ్డి నివాసంలో నగదును, పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. మొత్తం 15 బృందాలు వేర్వేరు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టాయి. శంషాబాద్, ఔటర్ రింగ్ రోడ్డు, రాయదుర్గం, సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం పటేల్గూడ వంటి పలు ప్రాంతాల్లో, సీఆర్పీఎఫ్ జవాన్ల సమక్షంలో ఈ సోదాలు జరిగాయి.