మహబూబ్నగర్ : మహబూబ్నగర్లో వర్షం దంచి కొట్టింది. భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. జిల్లా కేంద్రంలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు ఏకధాటిగా వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ వరద నీటితో నిండిపోయాయి.
రామయ్య బౌలి, కురువి శెట్టి కాలనీ, బీకే రెడ్డి కాలనీ ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. దీంతో అధికారులు హుటాహుటిన సహాయక చర్యలు ముమ్మరం చేశారు. లోతట్టు ప్రాంతాల్లో ఇండ్లలోకి నీరు చేరడంతో సామాన్లన్నీ తడిసి ముద్దయ్యాయి. రంగంలోకి దిగిన అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు.