హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి సంబంధించిన పార్లమెంటరీ కమిటీ ఆదివారం రాష్ట్ర అసెంబ్లీ కమిటీ హాల్లో సమావేశమైంది. వన్ నేషన్-వన్ అప్లికేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తదితర అంశాలపై చర్చించారు. సమావేశంలో కమిటీ చైర్మన్ తిరుచ్చి శివ, సభ్యులు రాకేశ్సిన్హా, కేఆర్ సురేశ్రెడ్డి, మోపిదేవి వెంకటరమణ, విశ్వంభర్ప్రసాద్ నిషాద్ తదితరులు పాల్గొన్నారు. కమిటీ సభ్యులకు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, శాసనసభ కార్యదర్శి వీ నర్సింహాచార్యులు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు.
కమిటీ సభ్యులతోపాటు ఇటీవల రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన సభ్యులను మండలి చైర్మన్ సత్కరించారు. నమస్తే తెలంగాణ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, ఎంపీ దీవకొండ దామోదర్రావుతో పాటు ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్యయాదవ్ను ఆయన సత్కరించారు. సమావేశం అనంతరం కమిటీ సభ్యులు శాసనమండలి, శాసనసభలను సందర్శించారు. అనంతరం అసెంబ్లీ లాంజ్లో భోజనం చేశారు. ఈ కమిటీ సోమవారం గోవాలో పర్యటించనున్నది. కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాతా మధు, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్రంజన్ పాల్గొన్నారు.