ఖమ్మం, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మంలోని పలు ప్రైవేట్ దవాఖానల్లో బుధవారం ఇన్కం టాక్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన 20 మంది మూడు బృందాలుగా ఏర్పడి నగరంలోని బాలాజీనగర్, వైరారోడ్లోని మూడు ఆస్పత్రుల్లో సోదాలు నిర్వహించారు.
ఆదాయం ఎక్కువ వస్తున్నప్పటికీ ప్రభుత్వానికి అందుకు తగిన విధంగా పన్ను చెల్లించక పోవడంతోనే సోదాలు జరిగినట్లు సమాచారం. ఆర్థిక లావాదేవీలకు సంబందించిన కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.