ఆసిఫాబాద్ టౌన్, జూలై 7 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పోడుభూముల వ్యవహారంలో ఆటవీశాఖ ఆధికారులతీరు సరైందికాదని ఎమ్మెల్యే కోవ లక్ష్మి మండిపడ్డారు. కెరమెరి మండలం సుర్దాపూర్ శివారులోని భూ మిని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకొని ట్రెంచ్ ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ బాధిత పోడురైతులతో కలిసి మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వర్షాకాలం వస్తేనే అటవీశాఖ అధికారులకు భూములు గుర్తుకొస్తున్నాయని మండిపడ్డారు.
రైతులు దుకిదున్ని విత్తనాలు వేసిన తర్వాత వచ్చి సాగు భూముల్లోకి వెళ్లకుండా అడ్డుకోవడం సరైనపద్ధతి కాదని చెప్పారు. 50 ఏండ్లుగా రైతులు సాగుచేసుకుంటున్న భూములను ఇప్పుడు అటవీ భూముల పేరిట లాకోవడం అన్యాయమని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్ర భుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆసిఫాబాద్ నియోజకవర్గంలో పోడురైతులపై వేధింపులు పెరిగాయని ఆరోపించారు.