హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర బడ్జెట్లో పాఠశాల విద్యాశాఖకు రూ.15 వేల కోట్లు ఇవ్వాలని ప్రతిపాదించనున్నారు. వీటిలో జీతాలకే రూ.14,500 కోట్లు అవుతుందని అధికారులు తేల్చారు. రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనల్లో భాగంగా ఈ నెల 29న సచివాలయంలోడిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విద్యాశాఖ అధికారులతో భేటీ కానున్నారు.
ఈ సందర్భంగా అధికారులు బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. గత బడ్జెట్లో రూ.13వేల కోట్లివ్వగా, ఈ దఫాలో రూ. 15 వేల కోట్లివ్వాలని అధికారులు ప్రతిపాదించనున్నారు. ఇక బడ్జెట్ ప్రతిపాదనల సమావేశం ఈ నెల 27న జరగాల్సి ఉండగా, ఈ నెల 29కి మార్చినట్టు ఆర్థికశాఖ అధికారులు గురువారం విద్యాశాఖకు సమాచారమిచ్చారు.