రంగారెడ్డి, మార్చి 15 (నమస్తే తెలంగాణ): బెంగళూరు హైవేపై ఫ్లైఓవర్ నిర్మాణానికి ఎట్టకేలకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అనుమతించినట్టు తెలిసింది. కొన్నేండ్లుగా పెండింగ్లో ఉన్న రోడ్డుకు ఎట్టకేలకు మోక్షం లభించింది. శంషాబాద్లోని సిద్ధాంతి చౌరస్తా ప్రమాదాలకు నెలవుగా మారింది. గతంలో జరిగిన పలు ప్రమాదాల్లో 12 మంది మరణించారు. ఈ విషయాన్ని చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి.. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. కేసీఆర్ సూచనల మేరకు ఈ రోడ్డు విషయాన్ని ఎన్హెచ్ఏఐకు విన్నవించారు.
హైదరాబాద్ – బెంగళూరు జాతీయ రహదారిపై ఉన్న శంషాబాద్ ఫ్లైఓవర్ను సిద్ధాంతి చౌరస్తా వరకు విస్తరించాలని స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ సైతం చొరవ చూపారు. ఎంపీ రంజిత్రెడ్డి పలుమార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లగా పెండింగ్లో ఉండిపోయింది. ఇటీవల ఈ చౌరస్తాలో మరో ఇద్దరు మృతి చెందడంతో సమస్యను ఎట్టి పరిస్థితుల్లోనైనా పరిష్కరించాలనే కోణంలో ఎంపీ రంజిత్రెడ్డి బుధవారం కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. సమస్య తీవ్రతను వివరించడంతో ఆయన సానుకూలంగా స్పందించారు. బెంగళూరు జాతీయ రహదారిని సిద్ధాంతి చౌరస్తా వరకు ఫ్లై ఓవర్ విస్తరణకు హామీ ఇచ్చినట్టు తెలిసింది. మంత్రి కలిసిన వారిలో ఎంపీలో మన్నె శ్రీనివాస్రెడ్డి, వెంకటేశ్ నేతకాని ఉన్నారు.