హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): మాయావతి బీఎస్పీని బీజేపీకి తోకపార్టీగా మార్చారని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు విమర్శించారు. మాయావతి కేసులకు భయపడే బీజేపీ ఆగడాల గురించి ప్రశ్నించడం లేదని మండిపడ్డారు. సోమవారం ఆయన బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ పర్యటనలో మాయావతి బీజేపీ గురించి పల్లెత్తు మాట కూడా మాట్లాడలేదని, ఆమె తీరు చూసి కాన్షీరాం ఆత్మ క్షోభిస్తుందని పేర్కొన్నారు. కా
న్షీరాం సిద్ధాంతాలను తుంగలో తొక్కి దళితులకు మాయావతి ద్రోహం చేస్తుంటే, దళితబంధు పథకం ద్వారా సీఎం కేసీఆర్ దళితులకు న్యాయం చేస్తున్నారని చెప్పారు. ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ సత్తా ఏమిటో మునుగోడు ఉప ఎన్నికలోనే తేలిపోయిందని ఎద్దేవా చేశారు. బీఎస్పీపై భ్రమల్లో ఉన్న వారు ఇప్పటికైనా బయటికి రావాలని సూచించారు.