KTR | ఖమ్మం జిల్లాలోని భూదాన్ భూముల్లో ఇండ్లపైకి బుల్డోజర్లు పంపించి కూల్చివేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వెయ్యి కోట్ల రూపాయలను గాంధీ కుటుంబానికి పంపుతానని సీఎం రేవంత్ రెడ్డి ప్రామిస్ చేశాడని.. అందుకే పేదల ఇళ్లు కూల్చి, భూములు అమ్మి డబ్బులు రెడీ చేయాలని చూస్తున్నాడని ఆరోపించారు. పేదల ఇండ్లు కూలగొడుతూ.. హైదరాబాద్లో తన రెండో ప్యాలెస్ కట్టుకుంటున్నాడని విమర్శించారు.
పేదల ఇండ్లు పెకిలించి వేస్తూ.. మరో పక్క తన కోటకు గోడలు కట్టడానికే కేవలం తొమ్మిది కోట్లు ఖర్చు చేస్తున్నాడని ముఖ్యమంత్రిపై కేటీఆర్ మండిపడ్డారు. భట్టి విక్రమార్క మూడో ఇంటిని కట్టుకుంటున్నాడని.. పొంగులేటి పదో కంపెనీ పెట్టి కమీషన్లు వెనకేసుకుంటున్నాని విమర్శించారు. పేదల జీవితాలను మాత్రం రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వం కాదు, రియల్ ఎస్టేట్ కంపెనీ.. వీళ్ళు మంత్రులు కాదు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అని విమర్శించారు.
వెయ్యి కోట్ల గాంధీ కుటుంబానికి పంపుతాను అని ప్రామిస్ చేశాడు.
అందుకే పేదల ఇళ్లు కూల్చి, భూములు అమ్మి డబ్బులు రెడీ చెయ్యాలని చూస్తున్నాడుపేదల ఇళ్లులు కూలగొడుతూ….అక్కడ హైదరాబాద్ లో తన రెండవ పాలస్ కట్టుకుంటున్నాడు CM!
పేదల ఇళ్ళు పెకిలించి వేస్తూ….మరో పక్క తన కోటకు తొమ్మిది… pic.twitter.com/nm0voocaBX
— KTR (@KTRBRS) February 27, 2026