సూర్యాపేట జిల్లా ప్రజలకు తీపి కబురు. జిల్లా కేంద్రంలో త్వరలో ఐటీ హబ్ ప్రారంభించేందుకు ప్రణాళికలు రెడీ అవుతున్నాయి. స్థానిక శాసనసభ్యుడు, రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జీ జగదీశ్రెడ్డి కృషి ఫలించబోతున్నది.
సూర్యాపేటలో ఐటీ హబ్ ప్రారంభించబోతున్నట్లు అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖామంత్రి కేటీఆర్ కాలిఫోర్నియాలో గురువారం ప్రకటించారు. ఇందుకుగానూ గ్లోబల్ ఐటీ సంస్థతోపాటు మరిన్ని సంస్థలు ముందుకు వస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు.