శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 3: ఐటీ కారిడార్లో డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేశారు. యూసుఫ్గూడ శ్రీరాంనగర్కు చెం దిన సులేమాన్ బిన్ అబుబాకర్ అలియాస్ వసీం (31), మెహదీపట్నం హుమాయున్నగర్కు చెంది న షేక్ అర్మాన్ అలియాస్ మోసిన్ చిక్కి (34), బంజారాహిల్స్ జహీరానగర్కు చెందిన అర్కామ్ హుసేన్(27) రెండేండ్లుగా గోవా, బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ పబ్లలో కొకైన్ గ్రాము రూ.15 వేలు, ఎండీఎంఏ గ్రాము రూ.8 వేలకు విక్రయిస్తున్నారు. క్లబ్లో నిజాంపేటకు చెందిన మిథున (37)తో సులేమాన్కు పరిచయం ఏర్పడింది.
మిథునతోపాటు ఆమె స్నేహితులకు సులేమాన్ డ్రగ్స్ విక్రయించేవాడు. కొద్ది రోజులకు ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో సులేమాన్ మిథునను వేధించడం మొదలుపెట్టాడు. విసిగిన ఆమె పోలీసులను ఆశ్రయించింది. మిథున్ 2 గ్రాముల కొకైన్ కావాలని సులేమాన్కు అర్డర్ చేయగా, ఫిబ్రవరి 2న ఐటీ కారిడార్లోని ఖాళీ స్థలంలో మిథునకు కొకైన్ను అందజేశాడు. అప్పటికే అక్కడ మాటువేసిన టీఎస్ న్యాబ్, ఎస్వోటీ, గచ్చిబౌలి పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. రూ.26 లక్షలు విలువచేసే డ్రగ్స్తోపాటు కారు, 5 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకొన్నారు.