హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని టైర్ 2 నగరాలకు ఐటీని విస్తరించేందుకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేస్తున్న కృషి సత్ఫలితాలను ఇస్తున్నది. వరంగల్లో మరో ప్రముఖ ఐటీ కంపెనీ తన కార్యకలాపాలను ప్రారంభించేందుకు ముందుకొచ్చింది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఎల్టీఐ మైం డ్ ట్రీ ఐటీ కంపెనీ ఈ నెలాఖరులో వరంగల్లో తన డెలివరీ సెంటర్ను ఏర్పాటు చేయనున్నదని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించా రు.
మంగళవారం హైదరాబాద్లో మంత్రి కేటీఆర్ను ఆ కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణ గొల్లపు కలిసి, వరంగల్లో ఏర్పాటు చేసి న తమ కార్యాలయాన్ని ప్రారంభించాలని ఆ హ్వానించారు. దీనికి మంత్రి కేటీఆర్ సమ్మతి తెలిపారు. ఫిబ్రవరి నెలాఖరులో కార్యాలయా న్ని ప్రారంభించనున్నట్టు కేటీఆర్ ప్రకటించా రు. ఎల్టీఐ మైండ్ ట్రీకి ప్రపంచవ్యాప్తంగా 30 దేశాల్లో బ్రాంచ్లు ఉన్నాయి. ఇందులో 90 వేల మందికిపైగా పనిచేస్తున్నారు.
షాక్కు గురయ్యా: మంత్రి కేటీఆర్
తుర్కియే, సిరియాలో భూకంపంతో జరిగిన విధ్వంసం చూసి షాక్కు గురయ్యానని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. నిజంగా ఇది చాలా బాధాకరమైన రోజు అని ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. వారి కోసం ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. మృతి చెందిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.