హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): ద్వితీయ శ్రేణి పట్టణాల్లోనూ టెక్నాలజీ రంగం ద్వారా ఉపాధి కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నదని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారక రామారావు తెలిపారు. సిద్దిపేటలో నిర్మించిన ఐటీ హబ్ను గురువారం ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావుతో కలిసి ప్రారంభించనున్నట్టు ట్వీట్ చేశారు. వచ్చే నెలలో నిజామాబాద్, ఆగస్టులో నల్లగొండ ఐటీ హబ్ను ప్రారంభించనున్నట్టు వెల్లడించారు.
వైద్యారోగ్య రంగంలో తెలంగాణ ప్రస్థానం దేశంలోనే ఒక సరికొత్త అధ్యాయమని మంత్రి కేటీఆర్ మరో ట్వీట్లో పేర్కొన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న వైద్య దినోత్సవం సందర్భంగా వైద్య రంగంలో వచ్చిన మార్పుల గురించి వివరించారు. కొత్త మెడికల్ కాలేజీలు, దవాఖానలు, డయాగ్నస్టిక్స్ సెంటర్లు, కేసీఆర్ కిట్లు ఇలా అనేక మార్పులు తీసుకువచ్చామని వివరించారు.
‘సమైక్య రాష్ట్రంలో ప్రజారోగ్యం అంటే..
గాలిలో దీపం స్వరాష్ట్రంలో ప్రభుత్వ వైద్యరంగానికి కొత్త రూపం.
నాడు.. సరార్ దవాఖాన అంటే దైన్యం
నేడు.. ప్రభుత్వ దవాఖానకు వెళ్తే ఒక ధైర్యం
కేసీఅర్ కిట్ల నుంచి.. న్యూట్రిషన్ కిట్ల దాకా..
డయాలసిస్ సెంటర్ల నుంచి..
డయాగ్నొస్టిక్ కేంద్రాల వరకు..
ప్రతి ఆలోచన ప్రతిష్ఠాత్మకం..
ప్రతి నిర్ణయం చరిత్రాత్మకం
వైద్యారోగ్య రంగంలో తెలంగాణ ప్రస్థానం..
దేశంలోనే ఒక సరికొత్త అధ్యాయం.
‘నేను రాను బిడ్డో సరారు దవాఖానాకు’
అనే దశాబ్దాల దుస్థితి నుంచి..
‘చలో పోదాం పదరో సరారు దవాఖానకు’
అనే ధీమానిచ్చిన ధీరోదాత్తమైన
నాయకత్వం తెలంగాణ సొంతం..
హైదరాబాద్ నలుదిశలా వైద్యరంగంలో నవశకం..
ఒకేసారి ప్రభుత్వరంగంలో నాలుగు సూపర్
స్పెషాలిటీ దవాఖానల నిర్మాణానికి శ్రీకారం..
దేశ చరిత్రలోనే ఒక సరికొత్త విప్లవం.
జిల్లాకో మెడికల్ కాలేజీ సంకల్పం..
డాక్టర్ కావాలన్న విద్యార్థుల
కలలను సాకారం చేసే మహాయజ్ఞం.
తొలి ఏడాది నుంచి తొమ్మిదో వసంతం దాకా..
బడ్జెట్లో వైద్యరంగానికి పెద్దపీట
కార్పొరేట్కి ధీటుగా ప్రతియేటా బంగారుబాట
కరోనా కష్టకాలంలో ప్రజలను కంటికి రెప్పలా
కాపాడిన తీరు అపూర్వం..
ప్రాణాలకు తెగించి సేవలందించిన అందరికీ
మరోసారి చేతులెత్తి సలాం..
దశాబ్దాలపాటు చికిశల్యమైన ప్రజారోగ్యానికి
శస్త్రచికిత్స సక్సెస్ అయిన వేళ..
ఆరోగ్య తెలంగాణ కోసం క్షేత్ర స్థాయి నుంచి..
రాష్ట్ర స్థాయి వరకూ..
అహర్నిశలు శ్రమిస్తున్న వైద్యారోగ్య శాఖలోని ప్రతిఒకరికీ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు.. అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.