వనపర్తి : పేదల సొంతింటి కలను నిజం చేసేలా సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఇస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. బుధవారం వనపర్తి పట్టణంలోని చిట్యాలలో నిర్మి్ంచిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేద ప్రజల కల సాకారం చేసేలా ముఖ్యమంత్రి వేల కోట్ల నిధులు వెచ్చించి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇస్తున్నారని తెలిపారు. ఇల్లు లేదని ఎవరు బాధపడకూడదని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తామన్నారు. కార్యక్రమంలో నాగర్ కర్నూలు ఎంపీ రాములు, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, కమిషనర్ మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
పవిత్ర స్నానాల కోసం వచ్చి ప్రాణాలు విడిచారు
అందరికి హెల్త్ ప్రొఫైల్.. అదే సీఎం కేసీఆర్ లక్ష్యం
కోయిల్ సాగర్ ప్రాజెక్టుకు నీటి విడుదల
ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం
ప్రభుత్వ వైద్య రంగంలో మరో మందడుగు : మంత్రి పువ్వాడ
శాశ్వత ఆధార్ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి