హైదరాబాద్: అరెస్టులతో లగచర్ల లడాయిని ఆపలేరని, బెదిరింపులతో రైతులను భయపెట్టలేరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. అర్దరాత్రి 300మంది పోలీసులను పంపి రైతులను అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు. రైతులు ఏమైనా తీవ్రవాదులు అనుకుంటున్నారా అని నిలదీశారు. ఇదేనా ప్రజాస్వామ్య పాలనా, రైతు సంక్షేమ పాలన అని మండిపడ్డారు. ఇదేనా వెలుగులను తరిమేసి.. చీకట్లు తెచ్చిన ఇందిరమ్మ రాజ్యం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అర్దరాత్రి అన్నదాతలను ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నించారు. ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేసి పచ్చని పొలాలను వల్లకాడు చేయవద్దన్నందుకు రైతులను అరెస్టు చేస్తున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ అల్లుడు, సోదరుల సంపాదనల కోసం భూమిని నమ్ముకున్న మా పొట్ట కొట్టవద్దన్నందుకు అరెస్టులు చేస్తున్నారని రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. రైతుల అరెస్టులను ఖండిస్తున్నామని, పోలీసుల చర్యలను వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. లగచర్ల గ్రామస్తుల పోరాటానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని హామీ ఇస్తున్నానని తెలిపారు.
అరెస్టులతో లగచర్ల లడాయిని ఆపలేరు!
బెదిరింపులతో రైతులను భయపెట్టలేరు!అర్దరాత్రి 300మంది పోలీసులను పంపి రైతులను అరెస్ట్ చేస్తారా?
రైతులు ఏమైనా తీవ్రవాదులు అనుకుంటున్నారా?
ఇదేనా ప్రజాస్వామ్య పాలనా?రైతు సంక్షేమ పాలన?
ఇదేనా వెలుగులను తరిమేసి.. చీకట్లు తెచ్చిన ఇందిరమ్మ రాజ్యం !…— KTR (@KTRBRS) November 12, 2024