హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రం, రైతుల ప్రయోజనం కంటే రాజకీయమే ముఖ్యమని మరోసారి తేలిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KCR) అన్నారు. మేడిగడ్డ దగ్గర కాఫర్ డ్యామ్ కట్టి, మరమ్మతులు చేయాలని.. నీళ్లు ఎత్తిపోసి ఆదుకోవాలని కేసీఆర్ డిమాండ్ చేస్తున్నారని వెల్లడించారు. నీటిపారుదల శాఖ ఇంజినీర్లు నివేదిక ఇచ్చిన తర్వాత కాఫర్ డ్యామ్ కట్టేందుకు ఎల్అండ్టీ కంపెనీ ముందుకు వచ్చిన తర్వాత కూడా ఈ ప్రభుత్వం చిల్లర రాజకీయాలతో రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నదని విమర్శించారు.
కేసీఆర్ను బద్నాం చేయాలనే ఒకే ఒక్క అజెండాతో కాఫర్ డ్యామ్ కట్టకుండా రైతులను నిండా ముంచాలని చూస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇంత నికృష్టమైన రాజకీయాలు కేవలం లోక్సభ ఎన్నికల్లో లాభం కోసమేనా? అంటూ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ఈ మేరకు పలు పత్రికల్లో ప్రచురితమైన క్లిప్పింగ్లను షేర్చేశారు.
మరోసారి కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రం మరియు రైతుల ప్రయోజనం కంటే రాజకీయమే ముఖ్యం అని తేలిపోయింది
మేడిగడ్డ దగ్గర కాఫర్ డాం కట్టి, మరమత్తులు చేసి, నీళ్లు ఎత్తిపోసి రైతులను ఆదుకోమని కెసిఆర్ గారు డిమాండ్ చేస్తున్నారు, డిపార్ట్మెంట్ ఇంజినీర్లు చెయ్యాలి అని రిపోర్ట్ ఇచ్చిన తరువాత, కడతాం… pic.twitter.com/pKqaAT2XAo
— KTR (@KTRBRS) April 18, 2024