జయశంకర్ భూపాలపల్లి, ఫిబ్రవరి 7(నమస్తే తెలంగాణ) : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అన్నారం బరాజ్కు సంబంధించి ఇరిగేషన్ అధికారులు స్టడీ టూర్ కోసం మహారాష్ట్రలోని పుణెకు వెళ్లారు. మోడల్ స్టడీస్లో భాగంగా ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలోని బృందం బుధవారం పుణెలో పర్యటించినట్టు అధికార వర్గాల ద్వారా తెలిసింది.
అన్నారం బరాజ్కు సంబంధించి డిజైన్ నిపుణులు, ఇరిగేషన్ అధికారులు, కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ ఏబీ పాండ్యాతో కలిసి వెళ్లారు. అన్నారం బరాజ్కు సంబంధించి పూర్తిస్థాయిలో స్టడీ చేస్తున్నట్టు సమాచారం. ఈ బృందం గురువారం కూడా పుణెలో అధ్యయనం చేయనున్నది.