ధర్మారం/రామడుగు, ఏప్రిల్ 4: కాళేశ్వర గంగ పరుగులు తీస్తున్నది. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల నందిమేడారంలోని నంది పంప్హౌస్ నుంచి రెండు మోటర్ల ద్వారా ఎగువకు ఉరకలు వేస్తున్నది. గత నెల 28న పంప్హౌస్లో మోటర్లను ఆన్చేసి ఎల్లంపల్లి బరాజ్లోని నీటిని ఎగువకు తరలిస్తున్నారు. ప్రస్తుతం రెండు మోటర్ల ద్వారా 6,300 క్యూ సెక్కుల నీటిని పక్కనే ఉన్న నంది రిజర్వాయర్లోకి ఎత్తిపోస్తున్నారు. అక్కడి నుంచి జంట సొరంగాల ద్వారా కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని గాయత్రీ పంప్హౌస్కు తరలిస్తున్నారు. ఇక్కడ సైతం రెండు బాహుబలి మోటర్లను ఆన్ చేసి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని శ్రీ రాజరాజేశ్వర జలాశయానికి తరలిస్తున్నట్టు అధికారులు తెలిపారు.
ఇవీ కూడా చదవండి…
గజ్వేల్ మార్కెట్ను సందర్శించిన ఆర్థికశాఖ కార్యదర్శి
తెలంగాణలో కొత్తగా 1,321 కరోనా కేసులు
‘కర్నాటి’కి నివాళులర్పించిన హోంమంత్రి
రాష్ట్రంలో దంచికొడుతున్న ఎండలు