సిద్దిపేట : గజ్వేల్లో గల ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డును రాష్ట్ర ఆర్థికశాఖ సెక్రటరీ కె. రామకృష్ణా రావు ఆదివారం సందర్శించారు. సిద్దిపేట కలెక్టర్ పి. వెంకట్రామిరెడ్డి మార్కెట్ను దగ్గరుండి చూపించారు. ఈ సందర్భంగా రామకృష్ణా రావు మాట్లాడుతూ మార్కెట్ నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. సమర్థవంతంగా నడుపుతున్న అధికారులను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ మదాసు అన్నపూర్ణ, తదితరులు పాల్గొన్నారు.