హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఈ వానకాలం 40.56 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు ఇరిగేషన్ శాఖ యాక్షన్ప్లాన్ను సిద్ధం చేసింది. నిరుటి వానకాలంలో 39.35 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించగా, ఈ సారి ఆయకట్టు మరింతగా విస్తరించనున్నది. భా రీ, మధ్యతరహా, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద సాగునీటిని అందించేందుకు ఇప్పటికే సాగునీటిశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. గోదావరి బేసిన్, కాళేశ్వరం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల కింద సాగునీటి పంపిణీకి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ మేరకు రాష్ట్రస్థాయి సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహణ కమిటీ (ఎస్సీఐఈఏఎం) ప్రతిపాదనలు సిద్ధం చేసింది. యాక్షన్ప్లాన్పై ప్రాంతాలవారీగా ఆయా చీఫ్ ఇంజినీర్ల నుంచి ఈఎ డన్సీ మురళీధర్ ఇప్పటికే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టుల నీటినిల్వలు, ఆయకట్టు విస్తీర్ణం తదితర అంశాలపై ఇటీవల చర్చించారు. నిరు టి తరహాలోనే ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో అంటే 8 రోజులు ఆన్, 7 రోజుల ఆఫ్ పద్ధతిలో ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు.