కాజీపేట, మార్చి 3 : హనుమకొండ జిల్లా కాజీపేట రైల్వే సబ్ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో రైల్వే ట్రాక్ నిర్వహణ పనుల్లో దినసరి లేబర్ను కుదించి సిబ్బందితో పనులు చేయించేందుకు కాంట్రాక్టు సంస్థలకు రైల్వే అధికారులు సహకరించడంపై సీబీఐ ఇటీవల కేసు నమోదు చేసింది. రైల్వే సబ్డివిజన్ పరిధిలో 2020-24 రైల్వే ట్రాక్ నిర్వహణ పనులను సంధ్య కన్స్ట్రక్షన్స్ కంపెనీ వేరే కాంట్రాక్టర్లతో కు మ్మకై తక్కువకు టెండర్ను దక్కించుకున్నది. సదరు కంపెనీ తగినంత మంది లేబర్లను పనిలో పెట్టకోకుండా, రైల్వే అధికారులను మచ్చిక చేసుకుని సిబ్బందితో ట్రాక్ పనులను చేయించి బిల్లులు తీసుకుంది.
సదరు కన్స్ట్రక్షన్ కంపెనీ తక్కువకు టెండర్ దక్కించుకుని పనులు ఎలా చేపడుతున్నదని ఇటీవల సీబీఐ విచారణ చేపట్టింది. ఈ విచారణలో సంధ్య కన్స్ట్రక్షన్ కంపెనీ లేబర్ను కు దించి ట్రాక్ నిర్వహణ పనులు చేపట్టడం, రైల్వే ఇంజినీరింగ్ కార్మికుల ను పనిలో వాడుకోవడం, రైల్వే అధికారులు సహకరించినట్టు నిర్ధారణకు వచ్చారు. ట్రాక్ పనుల్లో సిబ్బందిని తగ్గించడం, ఆ పనికి సరిపడా లేబర్ కు ఇవ్వాల్సిన ఈపీఎఫ్ తదితర బెనిఫిట్స్ ఇవ్వకుండా నకిలీ రిజిస్టర్ను సృష్టించినట్టు తేలింది. కాంట్రాక్టు సంస్థతో రైల్వే అధికారులు కుమ్మక్కైనట్టు గుర్తించి కాంట్రాక్టర్తో పాటు రైల్వే అధికారులపై సీబీఐ ఫిబ్రవరి 16న హైదరాబాద్లో కేసులు నమో దు చేసినట్టు సమాచారం.