హైదరాబాద్ : రాజకీయ నేతలపై ఐపీఎస్ అధికారుల సంఘం ఫైర్ అయ్యింది. కొన్ని రాజకీయ పార్టీల నాయకుల వ్యాఖ్యలు పోలీసుల ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని, పోలీస్లపై ప్రజల్లో తప్పుడు అభిప్రాయాన్ని తెచ్చేలా ఉన్నాయని పేర్కొంది. ఈ మేరకు గురువారం సంఘం తరఫున ఓ ప్రకటన విడుదల చేసింది.
డీజీపీ ఎం మహేందర్రెడ్డి తన చేతికి గాయం కారణంగా మెడికల్ సెలవులో వెళితే.. ప్రభుత్వం ఆయనను కావాలనే సెలవులో పంపిందని కొందరు నాయకులు వ్యాఖ్యానించడం సరైంది కాదని పేర్కొంది. అలాగే తెలంగాణ ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఒక రాష్ట్రానికి చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారంటూ నిరాధార ఆరోపణలు చేస్తున్నారంది. అయితే, ఐపీఎస్ అధికారుల సంఘం పీసీసీ చీఫ్పై వ్యాఖ్యలు స్పందించినప్పటికీ.. ప్రకటనలో ఆయన పేరును మాత్రం ఎక్కడా పేర్కొన లేదు.