VC Sajjanar | హైదరాబాద్ : రాష్ట్రంలో 23 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనర్గా వీసీ సజ్జనార్ నియామకం అయ్యారు. ప్రస్తుతం సీపీగా కొనసాగుతున్న సీవీ ఆనంద్.. హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియామకం అయ్యారు. ప్రస్తుతం సజ్జనార్ ఆర్టీసీ ఎండీగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా బదిలీల్లో భాగంగా ఆర్టీసీ ఎండీ పోస్టును నాగిరెడ్డికి కట్టబెట్టారు.
విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా శిఖా గోయల్ నియామకం అయ్యారు. ప్రస్తుతం సీఐడీ అదనపు డీజీగా ఉన్న చారుసిన్హాకు ఏసీబీ డీజీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డీజీగా స్వాతిలక్రాకు అదనపు బాధ్యతలు కట్టబెట్టారు. ఇంటెలిజెన్స్ డీజీగా విజయ్ కుమార్, మల్టీజోన్-2 ఐజీగా డీఎస్ చౌహాన్, విపత్తు నిర్వహణ ఫైర్ డీజీగా విక్రమ్సింగ్, పౌరసరఫరాల ప్రిన్సిపల్ సెక్రటరీగా స్టీఫెన్ రవీంద్ర బదిలీ అయ్యారు.
హైదరాబాద్ నేర విభాగ అదనపు సీపీగా శ్రీనివాసులు, హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ జాయింట్ కమిషనర్గా తఫ్సీర్ ఇక్బాల్, సిద్దిపేట కమిషనర్గా ఎస్ఎం విజయ్ కుమార్, ఏసీబీ జాయింట్ డైరెక్టర్గా సింధు శర్మ, నారాయణపేట ఎస్పీగా జీ వినీత్, ఎల్బీనగర్ డీసీపీగా అనురాధ, ఏసీబీ జాయింట్ డైరెక్టర్గా సీహెచ్ ప్రవీణ్ కుమార్, రాజేంద్రనగర్ డీసీపీగా యోగేష్ గౌతమ్, వెస్ట్ జోన్ డీసీపీగా సీహెచ్ శ్రీనివాస్, మాదాపూర్ డీసీపీగా రితు రాజ్, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వైస్ చైర్మన్గా రవి గుప్తా బదిలీ అయ్యారు.