హైదరాబాద్: క్రికెట్ బెట్టింగ్ (cricket betting) నిర్వహిస్తున్న ముఠా గుట్టును హైదరాబాద్ సిటీ పోలీసులు రట్టు చేశారు. నగరంలో ఐపీఎల్పై బెట్టింగ్కు పాల్పడుతున్న ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.43 లక్షలు, ల్యాప్టాప్, కారు స్వాధీనం చేసుకున్నారు. వారి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ నెల 1న కూడా బెట్టింగ్కు పాల్పడుతున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లక్నో సూపర్ గెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ సందర్భంగా బెట్టింగ్కు పాల్పడిన ముగ్గురిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.లక్ష నగదు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.