హైదరాబాద్ : రాజస్థాన్ రాజధాని జైపూర్లో ఏప్రిల్ 2న శ్రీకల్పతరు సంస్థాన్ ఎన్జీవో ఆధ్వర్యంలో వృక్ష మిత్ర సమ్మాన్ సమారోహ్ కార్యక్రమం జరగనున్నది. ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా రాజ్యసభ సభ్యుడు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త జోగినపల్లి సంతోశ్ కుమార్కు శ్రీ కల్పతరువు సంస్థాన్ ఎన్జీవో వ్యవస్థాపకుడు, ట్రీ మ్యాన్ ఆఫ్ ఇండియా విష్ణు లాంబా ఆహ్వానం పంపించారు. ప్రపంచ పర్యావరణవేత్త ఎరిక్ సోల్హైం కూడా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.
తనకు ఆహ్వానం పంపించడం పట్ల విష్ణు లాంబాకు ట్విట్టర్ వేదికగా ఎంపీ సంతోశ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. మాతృభూమిని మరింత అందంగా తీర్చిదిద్దాలని నిశ్చయించుకున్న మీలాంటి వారిని కలుసుకునేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు.
Excited. Thank you so much @TreemanOfIndia Vishnu Lamba ji for inviting me. Eagerly waiting to be there as well @ErikSolheim. Great opportunity to be able to meet many of you crusaders who are determined to make the Mother Earth more beautiful.#GreenIndiaChallenge @kalptaru108 pic.twitter.com/zz7ZFwPvuN
— Santosh Kumar J (@MPsantoshtrs) March 19, 2022