యాదగిరిగుట్ట, మే 27: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానం సంస్కృత విద్యా పీఠంలో 2023-24 విద్యా సంవత్సరంలో వివిధ కోర్సుల్లో ప్రవేశాలను ప్రారంభించినట్టు ఆలయ ఈవో ఎన్ గీత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రథమ కక్షా సంస్కృతానికి 5వ తరగతి ఉత్తీర్ణత, ద్వితీయ కక్ష సంస్కృతానికి 6వ తరగతి, తృతీయ కక్షా సంస్కృతానికి 7వ తరగతి, చతుర్థ కక్షా సంస్కృతానికి 8వ తరగతి, పంచమ కక్షా (సంస్కృత ఎంట్రెన్స్) 9వ తరగతి, పీడీసీ (2 సంవత్సరాలు) 10వ తరగతి ఉత్తీర్ణత పొంది ఉండాలని పేర్కొన్నా రు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ అన్ని తరగతులవా రికి ప్రవేశ అర్హత ఉన్నదని తెలిపారు. ప్రవేశానికి ఆగస్టు 31 వరకు గడువు ఉన్నద తెలిపారు.