CM KCR | దేశంలో పెట్టుబడుల రాకను అడ్డుకొంటున్న ఆ అదృశ్య శక్తి మరేదో కాదు.. అధికార బీజేపీ ప్రభుత్వమే. అంటే సర్కారు అసమర్థ, అనాలోచిత,ముందుచూపులేని విధానాలే.. పెట్టుబడులు రాకపోవడానికి కారణం. ఇది ఎవరో అన్న మాట కాదు.. రాజ్యసభలో పార్లమెంటరీ ప్యానెల్ తాజాగా సమర్పించిన నివేదిక బట్టబయలు చేసిన నిజం.
మరోవైపు, తొమ్మిదేండ్ల వ్యవధిలో ఆర్థికరంగంలో కొత్త ఆవిష్కరణలకు బాటలు వేసిన తెలంగాణలో పెట్టుబడుల వరద పారుతున్నది. గడిచిన రెండు ఆర్థిక సంవత్సరాల్లో రాష్ర్టానికి ఏకంగా రూ. లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇంత తక్కువ సమయంలో ఈ స్థాయిలో పెట్టుబడులను మరే ఇతర రాష్ట్రం ఆకర్షించలేదు.
(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): పెట్టుబడులను ఆకర్షించడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమవుతున్నదని పార్లమెంటరీ స్థాయీ సంఘం (పార్లమెంటరీ ప్యానెల్ ఆన్ కామర్స్) వెల్లడించింది. చైనాలో పెట్టుబడులకు విముఖంగా ఉన్న పారిశ్రామికవేత్తలను ఆకర్షించడంలో విఫలమవుతున్నట్టు తేల్చిచెప్పింది. దేశంలో అపార వనరులున్నా పెట్టుబడులను ఆకర్షించడంలో కేంద్ర వైఫల్యాలపై అసహనం వ్యక్తం చేసింది. పారిశ్రామికవేత్తల దృష్టిలో భారత్ పట్ల సానుకూల దృక్పథాన్ని కల్పించడంలో కేంద్రం సఫలీకృతం కావట్లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం రాజ్యసభలో నివేదిక సమర్పించింది.
‘చైనా ప్లస్ వన్ స్ట్రాటజీ’ విధానం ద్వారా అందివచ్చే ప్రయోజనాలను కేంద్రం అందిపుచ్చుకోవడంలేదని పార్లమెంటరీ ప్యానెల్ అభిప్రాయపడింది. దీంతో చైనాకు వెలుపల పెట్టుబడులు, పరిశ్రమలను స్థాపించాలనుకొంటు న్న పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు భా రత్ను కాదని మిగతా ఆగ్నేయాసియా దేశాలైన వియత్నాం, థాయిలాండ్, కంబోడియా, మలేషియాల్లో పెట్టుబడులు పెడుతున్నట్టు తెలిపింది. ఫలితంగా తయారీ, ఉత్పత్తులకు సంబంధించి దేశంలోకి రావాల్సిన పలు బ హుళజాతి సంస్థలు మిగతా ఆసియా దేశాల్లో కి తరలిపోతున్నట్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఫార్మారంగంలో మిగతా దేశాలకు పోటీనిచ్చే విషయంలో భారత్ వెనుకంజలో ఉన్నట్టు చెప్పింది. చైనా నుంచి ఔషధాలు, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్గ్రీడియెంట్స్ను పెద్దమొత్తంలో దిగుమతి చేసుకోవడమే దీనికి కారణంగా ఎత్తిచూపింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో నవంబర్ 30 నాటికి రూ. 27,209 కోట్ల ఏపీఐలను దిగుమతి చేసుకొంటే, వాటిలో రూ. 18,973 కోట్లు (సుమారు 70 శాతం వాటా) చైనా నుంచే దిగుమతి చేసుకున్నామని పేర్కొంది. 2020లో జరిగిన గల్వాన్ ఘర్షణల్లో 20 మంది జవా న్లు అమరులైన ఘటన తర్వాత కూడా చైనా నుంచి భారత్ చేసుకొంటున్న దిగుమతులు అంతకంతకూ పెరిగిపోవడం గమనార్హం.
దేశంలో పెట్టుబడులను ఆకర్షించడానికి ప్యానెల్ సూచనలు చేసింది. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ స్కీమ్తో విభిన్న రంగాలకు చెంది న వైవిధ్యమైన కంపెనీలను ఆకర్షించవచ్చని పేర్కొంది. ‘చైనా ప్లస్ వన్ స్ట్రాటజీ’తో దేశం లో పారిశ్రామికీకరణ జరుగుతుందని, తద్వా రా వ్యూహాత్మక పారిశ్రామిక రంగాలకు కేం ద్రంగా ఉన్న చైనా స్థానంలో భారత్ చేరి గ్లో బల్ వాల్యూ చైన్స్ (జీవీసీ)కు ఊతం ఇవ్వొచ్చని అభిప్రాయపడింది. ‘పెట్టుబడిదారులకు మెషినరీ, ఆటోమొబైల్, రవాణా, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ పరిశ్రమలు స్థాపించేందుకు వియత్నాం, థాయిలాండ్, తైవాన్, మలేషియా దేశాలు చైనాకు ప్రత్యామ్నాయాలుగా కనిపిస్తున్నాయి. చౌకగా శ్రామికశక్తి లభించడం, కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ తక్కువగా ఉండటం, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్టీఏ) తదితర అంశాలు ఆయా దేశాలకు సానుకూలంగా ఉన్నాయి’ అని ప్యానెల్ పేర్కొంది. కేంద్రప్రభుత్వం కూడా ఈ దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించింది.
చౌకగా లభించే శ్రామిక శక్తి, అపారమైన వనరులు చైనాలో ఉండటంతో గడిచిన 30 ఏండ్లుగా పశ్చిమ దేశాలు అక్కడ పెట్టుబడులను విరివిగా పెట్టసాగాయి. అయితే, ఆర్థికం, రక్షణ, వ్యూహాత్మక రంగాల్లో చైనా దూకుడు పెరిగిపోవడంతో 2013లో ‘చైనా ప్లస్ వన్ స్ట్రాటజీ’ని ఆయా దేశాలు తెరపైకి తీసుకొచ్చాయి. చైనాతో పాటు మరికొన్ని ఆగ్నేయాసియా దేశాల్లో పెట్టుబడులు పెట్టడమే ఈ వ్యూహం ఉద్దేశం. దీంతో చైనాను కట్టడి చేయవచ్చని ఆయా దేశాల భావన.
ఎన్పీఏ (బీజేపీ) ప్రభుత్వానికి ఆర్థికం కంటే రాజకీయమే ప్రాధాన్యమైంది. ఆర్థిక రంగాన్ని గాలికొదిలేసి, రాజకీయానికి ప్రాధాన్యమిస్తే ఫలితాలు ఇలాగే ఉంటాయి. టెలిప్రాంప్టర్ చూసి ప్రసంగించడం సులువే. పటిష్ఠ ప్రయత్నాలు లేకపోతే ఫలితాలు రావడం కష్టం. భారతీయ యువతకు ఇది నిరుత్సాహాన్ని కలిగిస్తుంది.
– పార్లమెంటరీ ప్యానెల్ నివేదికపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్
‘పెట్టుబడులు పెట్టడానికి ఎందుకు వెనుకంజ వేస్తున్నారు? మిమ్మల్ని ఆపుతున్న శక్తి ఏంటి? అదేంటో తెలుసుకోవాలనుకొంటున్నా?’నిరుడు సెప్టెంబర్లో పారిశ్రామికవేత్తల సదస్సులోఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలివి.