ఇన్కం ట్యాక్స్ ప్రజలకు యూజ్లెస్ ట్యాక్స్.. మోదీకి సింపుల్ అర్థమెటిక్ కూడా తెలియదు ఇది తప్పు.. ఇది ఒప్పు అని చెప్పేవారు లేరు.. మోదీ నిర్ణయాలను ప్రశ్నిస్తే.. ఐటీ, ఈడీ దాడులు పత్రికల్లో ఏం రావాలో పీఎంవో నిర్దేశిస్తున్నది.. ఇలాగే కొనసాగితే దేశంలో ఆర్థిక మాంద్యం నమస్తే తెలంగాణతో ప్రముఖ ఆర్థికవేత్త, బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): దేశానికి బలమైన ప్రతిపక్షం కావాలని, కాంగ్రెస్ పార్టీ తన పాత్రను పోషించలేకపోతున్నదని ప్రముఖ ఆర్థికవేత్త, బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి అభిప్రాయపడ్డారు. దేశంలో నరేంద్రమోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతిన్నదని, ఆర్థిక రంగంపై మోదీకి కనీస అవగాహన లేదని, ఇదే పరిస్థితి కొనసాగితే దేశంలో ఆర్థిక మాంద్యం తప్పదని ఆయన హెచ్చరించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలు మెచ్చే నాయకుడని, జాతీయస్థాయిలో ఆయన కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ, ఐఐటీ ఢిల్లీలో పూర్తికాల ప్రొఫెసర్గా పనిచేసిన సుబ్రహ్మణ్యస్వామి నమస్తే తెలంగాణకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు..
ఇది వాస్తవమే. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నెహ్రూ మొదలు నరేంద్రమోదీ వరకు రైతులంటే టేకిట్ ఫర్ గ్రాంటెడ్గా చూశారు. కాంగ్రెస్, బీజేపీలతోపాటు దేశాన్ని పాలించిన ప్రభుత్వాలన్నీ ఈ పరిస్థితికి కారణం. కేసీఆర్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నాను.
దేశంలోని అనేక నదుల్లో ఇప్పుడు ఉపయోగించుకుంటున్నదానికన్నా ఎకువ నీళ్లు ఉన్నాయి. పూర్తిస్థాయిలో నీళ్లను మనం వాడుకోలేకపోతున్నాం. గోదావరి, కృష్ణాతోపాటు అనేక నదుల నీళ్లు బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. ఒక్క కేరళలోనే 46 నదులు ఉన్నాయి. నదులను అనుసంధానం చేస్తూ వాటర్గ్రిడ్ వంటిదాన్ని నిర్మించాలి. కాలువలు నిర్మించాలి. ఈ కాలువలను రవాణామార్గంగా కూడా వాడుకోవచ్చు. సముద్ర నీటిని డీసాలినేషన్ చేసి ఉపయోగంలోకి తేవాలి. ఇజ్రాయెల్ వంటి దేశాలు ఇప్పటికే సముద్రపు నీటి నుంచి ఉప్పును తీసివేసి శుద్ధజలంగా మారుస్తున్నాయి. ఈ నీటిని తాగునీటి అవసరాలకు, సాగునీటి కొరతను తీర్చేందుకు వాడుకోవచ్చు. మరోవైపు ఫర్టిలైజర్స్, విత్తనాలు, పురుగుమందులు.. ఇలా మిగిలిన అంశాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టిపెట్టవచ్చు. ఇవన్నీ స్వాతంత్య్రం వచ్చిన తొలి 30 ఏండ్లలోనే చేయాల్సింది. కానీ, చేయలేకపోయారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలు మెచ్చే పథకాలను చేపడుతున్నారు కాబట్టే ఎన్నికల్లో వరుస విజయాలు సాధిస్తున్నారు. కేసీఆర్ చదువుకున్న వ్యక్తి. నాకు 30-40 ఏండ్లుగా తెలుసు. పేదల మనిషి. రైతు కుటుంబం నుంచి వచ్చారు. అందుకే ఆయన రైతుల సమస్యలను అర్థం చేసుకోగలరు, వాటిని పరిషరించగలరు.
నేను మొదటి నుంచీ ఇదే విషయాన్ని చెప్తున్నా. ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో పయనిస్తున్నదని, సరిచేయాలని ప్రధానమంత్రికి 2015లోనే లేఖ రాశాను. కరోనాకు ముందు నుంచే దేశ ఆర్థిక వృద్ధిరేటు తగ్గుతూ వస్తున్నది. అంటే 2019-20 ఆర్థిక సంవత్సర చివరి త్రైమాసికంలో జీడీపీ వృద్ధిరేటు కేవలం 3.1 శాతంగా నమోదైంది. ఇది జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో కన్నా తకువ. మోదీకి ఎకనామిక్స్ అర్థం కాదు. ఆయన అర్థం చేసుకోరు కూడా. ఎకనామిక్స్ విషయానికి వచ్చేసరికి మోదీ అట్టర్ ఫెయిల్యూర్ అని చెప్పవచ్చు. హఠాత్తుగా ఆయన జీడీపీని అయిదేండ్లలోనే డబుల్ చేస్తా అంటాడు. ఐదు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మారుస్తా అంటాడు. అంటే ఏడాదికి 14.8 శాతం వృద్ధిరేటు నమోదు చేయగలరా? అసలు ఇది సాధ్యమయ్యేదేనా? ఒకవేళ నువ్వు అయిదేండ్లలోనే ఎకానమీని రెండింతలు చేయాలనుకుంటే అర్థమెటిక్స్ను అర్థం చేసుకోవాలి. కానీ, మోదీకి సింపుల్ అర్థమెటిక్ కూడా తెలియదు. ఈ విషయాన్ని నేను పబ్లిగ్గానే చెప్పాను. ఆయనకు ఎకానమీ గురించి చెప్పే సలహాదారులు లేరు. ఇది తప్పు.. ఇది ఒప్పు అని చెప్పేవారు లేరు. ప్రతీ ఒకరూ ఆయన చెప్పినదానికి తల ఊపేవారే. ఎస్ సర్ అనేవారే.
దేశంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు లేవు. దీంతో అవి మూతపడ్డాయి. వడ్డీరేట్లు పెంచేశారు. డీమానిటైజేషన్ (నోట్ల రద్దు) కూడా ఒక కారణం. అదో పెద్ద ఫ్లాప్. జీడీపీ తగ్గడానికి మరో కారణం పన్నులను పెంచుతూ పోవడం. ఇన్కం ట్యాక్స్ అన్నది భారతదేశ ప్రజలకు యూజ్లెస్ ట్యాక్స్. దీన్ని రద్దు చేయాల్సింది. 8-9 లక్షల కోట్లు కూడా దీనివల్ల రావు. ఇది దేశబడ్జెట్లో చాలా చిన్న మొత్తం. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే పన్నులు, ఆదాయం వచ్చే ఇతర మార్గాలను పెంచుకోవాలి. వనరులు అనేకం ఉన్నాయి. పబ్లిక్ వర్స్ కోసం ప్రజలపై పన్నులు వేయవద్దు. అవసరమైతే నగదును ముద్రించి పనిచేసేవారికి ఇవ్వాలి. వారు ఆ నగదును ఉపయోగిస్తారు. దీనివల్ల డిమాండ్ ఏర్పడుతుంది. ప్రస్తుతం పేదల వద్ద డబ్బులు లేవు. పొదుపు చేద్దామంటే మధ్య తరగతివారి వద్ద సొమ్ము లేదు. ఇప్పుడున్న ఆర్థిక విధానాలు ఇదేవిధంగా కొనసాగితే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది.
ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినప్పుడు వ్యవసాయ రంగం కూడా నష్టపోతుంది.
ఇది తొలినాళ్ల నుంచి కొనసాగుతూనే వస్తున్నది. కేంద్ర ప్రభుత్వాల విధానాలు ధనికులకు అనుకూలంగా ఉంటున్నాయి. ముమ్మాటికీ నిరుద్యోగ సమస్యను పట్టించుకోకపోవడం వైఫల్యమే. గతంలో పాలించినవాళ్లు చేయకపోతే.. ఇప్పుడున్న వాళ్లు చేయవద్దా..? మార్పు వద్దా..?
వ్యవసాయం రాష్ట్ర పరిధిలో ఉండే అంశం. కానీ, కేంద్ర ప్రభుత్వం సంసరణల పేరుతో వేలు పెట్టాలని చూసి వెనకి తగ్గింది. ఒకవేళ సంసరణల చట్టాలను తేవాలనుకుంటే వాటిని తొలుత బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయాలి.. దేశమంతటికీ రుద్దుతానంటే ఎట్లా..? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చట్టాలను అమలు చేసి దాని ఫలితాలను ఇతర రాష్ట్రాలకు చూపించి.. ఆసక్తి ఉన్న రాష్ట్రాలు అమలు చేసుకోవాలని చెప్పాలి. మారెటింగ్ వసతులు ఉండి, ప్రజల జీవన ప్రమాణాలు, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డపుడు అసలు కనీసమద్దతు ధర అడగాల్సిన అవసరం రైతులకు కూడా ఉండదు.
ఆ చట్టాలను వెనకు తీసుకోవాలని మొదట నేనే మాట్లాడాను. కాంగ్రెస్ కనీసం ప్రతిపక్ష పార్టీగా కూడా స్పందించడం మానేసింది. అనేక రాష్ట్రాల సీఎంలు భయపడుతున్నారు. వణికిపోతున్నారు. పోరాటానికి ముందు కు రావడంలేదు. మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై మాట్లాడితే తమపై ఆదాయపన్ను శాఖ, ఎన్ఫోర్స్మెంట్ విభాగాలు దాడులు చేస్తాయని మాట్లాడకుండా ఉంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర వైఖరిని నిలదీస్తున్నారు. ఇది ఆహ్వానించదగ్గదే. మా పార్టీ నేతలు నాతో మాట్లాడుతూ ఎవ్వరూ విమర్శించనిది నువ్వెందుకు విమర్శిస్తున్నావని అడిగారు. నెహ్రూ మొదలు నేటి వరకు ఎవరిని గమనించినా తమకు అనుకూలంగా లేనివారిని భయపెట్టారు. లొంగదీసుకునే ప్రయత్నం చేశారు. చివరకు మీడియా విషయంలో కూడా అలాగే ప్రవర్తించారు. పత్రికల్లో ఏం రావాలన్నది ప్రధానమంత్రి కార్యాలయం డిక్టేట్ చేసే రోజులను చూస్తు న్నాం. ఇది
సరికాదన్నది నా అభిప్రాయం.
దేశానికి ఒక బలమైన ప్రతిపక్షం అవసరం. అధికార పార్టీ చేసే తప్పులను ఎత్తిచూపే పార్టీ కావాలి. భయపెడితే భయపడే పార్టీ కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థకు బలమైన ప్రతిపక్షం అవసరం. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించలేదు. ఇప్పుడు ఆ పార్టీలో ఉన్న గాంధీ కుటుంబాన్ని భారతీయులుగా భావించడంలేదు. దేశానికి కేసీఆర్ వంటి నాయకుడి అవసరం ఉన్నది. ఆయన ఒంటిచేత్తో ఎన్నికల్లో తన పార్టీని గెలిపించుకున్నారు. ఉప ఎన్నికల్లో కూడా ఆయన విజయాలు సాధిస్తూ వచ్చారు. తెలివితేటలు ఉన్న నాయకుడు. ఆయన దేశానికి స్ట్రాంగ్ అపోజిషన్గా ఉండాలి. గడరీ, రాజ్నాథ్సింగ్ నేతృత్వంలో బీజేపీ బాగుపడుతుందనుకొని నా జనతా పార్టీని విలీనం చేశాను. కానీ, ఇప్పుడు అమిత్షా, నరేంద్రమోదీలు నేను పార్టీలో ఉండవద్దని చూస్తున్నారు. నేను చెప్పాలనుకున్నది నా టీవీ కార్యక్రమాలు, చర్చా కార్యక్రమాల ద్వారా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను.