Tigers Day | శ్రీశైలం అటవీశాఖ విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించి, అవగాహన కల్పించారు. ఎఫ్ఆర్వో మదన్కుమార్ ఆధ్వర్యంలో శనివారం అసిస్టెంట్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ధన్రాజ్, బయోడైవర్సిటీ నర్సింహులు ఎస్టీ స్కూల్ విద్యార్థులత కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో మాట్లాడుతూ ప్రకృతి సంపదైన అడవులను కాపాడుకోవడం అందరి బాధ్యత అన్నారు. అడవిలో ఉండే ప్రతి ప్రాణికి మానవ మనుగడతో అవినాభావ సంబంధం ఉందని, వాటిని రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో ఓబులేసు, శంకర్, సలాం అల్లా, భీంనాయక్, బాలాజీ, ఠాగూర్తోపాటు సిబ్బంది, ప్రొటెక్షన్ వాచర్లు ఉన్నారు.