హైదరాబాద్ : తెలంగాణకు హరితహారం ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న పచ్చదనం పెంపు, అటవీ పునరుజ్జీవన కార్యక్రమాలు జాతీయ, అంతర్జాతీయ గుర్తింపును పొందాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున అభివృద్ధి చేస్తున్న అర్బన్ ఫారెస్ట్ పారుల పురోగతిని అంతర్జాతీయ సంస్థ వరల్డ్ ఫారెస్ట్ సైన్స్ గుర్తించింది. ఆ సంస్థ నిర్వహించిన ఆన్లైన్ బ్లాగ్ కాంపిటిషన్లో అదనపు అటవీ సంరక్షణ అధికారి ఎంసీ పర్గెయిన్ రాసిన కాలమ్ మూడో స్థానం దకించుకుంది.
ప్రపంచ ట్రీ సిటీగా ఇటీవలే గుర్తింపు తెచ్చుకున్న హైదరాబాద్ పర్యావరణ పరంగా పునరుజ్జీవనం పొందటం, అందుకు దోహద పడుతున్న అర్బన్ ఫారెస్ట్ పారులపై రిసిలియెన్స్ అండ్ బెటర్ లైఫ్ విత్ అర్బన్ ఫారెస్ట్స్ ఇన్ హైదరాబాద్ (rblwufh) పేరుతో పర్గెయిన్ బ్లాగ్ రాశారు. ఈ కాలమ్ అంతర్జాతీయంగా మూడో స్థానంలో నిలిచింది. మే 2 నుంచి 6 దాకా దక్షిణ కొరియా రాజధాని సియోల్లో జరిగే వరల్డ్ ఫారెస్ట్ సైన్స్లో అర్బన్ ఫారెస్ట్ పారులపై కూడా చర్చ జరుగుతుంది. తెలంగాణలో అర్బన్ ఫారెస్ట్ పారుల అభివృద్ధి గురించి, అటవీ పునరుద్ధరణ పనుల వివరాలు తెలుసుకున్న అంతర్జాతీయ జ్యూరీ ప్రశంసించింది.
చాలా వినూత్న కార్యక్రమాలు చేపడుతున్న ప్రభుత్వాన్ని, అటవీ శాఖను ప్రశంసించింది. అటవీ బ్లాక్లను వివిధ సంస్థలు, వ్యక్తులు దత్తత తీసుకుని పర్యావరణ హితంగా అభివృద్ధి చేస్తున్న విధానాన్ని కూడా జ్యూరీ ప్రశంసించింది. తెలంగాణ ప్రభుత్వం హరితహారం ద్వారా 109 అర్బన్ ఫారెస్ట్ పారులను రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి చేస్తోంది. ఇందులో 59 పారులు రాజధాని హైదరాబాద్ చుట్టుపకల హెచ్ఎండీఏ పరిధిలో ఉన్నాయి.