హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ఇటీవల ముగిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నవంబర్ 6వ తేదీ నుంచి ప్రశ్నాపత్రాల మూల్యాంకనం ప్రారంభించారు. అయితే స్పాట్ వాల్యుయేషన్కు ఇప్పటికీ కొంతమంది లెక్చరర్లు రిపోర్టు చేయలేదు. ప్రభుత్వ, ప్రయివేటు కళాశాలల జూనియర్ కాలేజీ లెక్చరర్లు గురువారం ఉదయంలోగా స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాల్లో రిపోర్టు చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్మీడియట్ బోర్డు హెచ్చరించింది. కాలేజీల యాజమాన్యాలు కూడా లెక్చరర్లను రిలీవ్ చేయాలని ఇంటర్మీడియట్ బోర్డు సూచించింది.