హైదరాబాద్ : ఇంటర్మీడియట్ ప్రవేశాలకు షెడ్యూల్ విడుదలైంది. నేటి నుంచి జులై 5వ తేదీ వరకు ప్రవేశాలకు అనుమతి. జూన్ 1 నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం ఆన్లైన్ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఇంటర్నెట్ మార్కుల మెమోల ఆధారంగా ప్రాథమిక ప్రవేశాలు చేసుకోవాల్సిందిగా కళాశాలల ప్రిన్సిపాళ్లకు ఇంటర్బోర్డు సూచించింది. అనంతరం ఎస్ఎస్సీ పాస్ సర్టిఫికేట్, టీసీ, స్టడీ సర్టిఫికెట్ల ఆధారంగా ప్రవేశాలను ధ్రువీకరించాలని పేర్కొంది.