Inter Student Suicide | నార్సింగి శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ విద్యార్థి ఎన్. సాత్విక్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తరగతి గదిలోనే మంగళవారం రాత్రి 10.30 సమయంలో ఉరి వేసుకున్నాడు. గమనించిన తోటి విద్యార్థులు కలిసి వాహనంలో లిఫ్ట్ అడిగి దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అయితే, కాలేజీలో ఒత్తిడి వల్లే సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నాడని తోటి విద్యార్థులు ఆరోపించారు.
ఉరి వేసుకున్నా కళాశాల యాజమాన్యం కనీసం ఆసుపత్రికి కూడా తరలించలేదని మండిపడ్డారు. పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియాకు మృతదేహం తరలించారు. సాత్విక్ ఆత్మహత్యను నిరసిస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులు కాలేజీ వద్ద ఆందోళన చేపట్టారు. యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు విద్యార్థి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విద్యార్థులు, కుటుంబీకుల ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.