సంగారెడ్డి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఫ్యాన్కు ఉరేసుకొని ఇంటర్ విద్యార్థిని(Inter student) బలవన్మరణానికి (Suicide) పాల్పడింది. ఈ విషాదకర సంఘటన జహీరాబాద్ మండలం రంజోల్(Ranjol) బాలికల గురుకుల పాఠశాలలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
గురుకుల పాఠశాలలో ఇంటర్ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న స్వప్న (17) డార్మెంటరీ గదిలో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు. గమనించిన విద్యార్థులు, సిబ్బంది స్వప్నను చికిత్స కోసం జహీరాబాద్ సర్కార్ తవఖానకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలి స్వగ్రామం జహీరాబాద్ మండలంలోని తూముకుంటగా గుర్తించారు.