జడ్చర్లటౌన్, మే 19 : ఆర్టీసీ బస్సుల్లో ఎక్కే మహిళ ప్రయాణికులను టార్గెట్గా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న హర్యానాకు చెందిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్టు మహబూబ్నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పోలీస్ స్టేషన్లో డీఎస్పీ వివరాలను వెల్లడించారు. హర్యానాకు చెందిన సందీప్, అశోక్, ప్రవీణ్, రాజేశ్, సునీల్కుమార్, సచిన్ కలసి కొంతకాలంగా ఆర్టీసీ బస్సుల్లో ఎక్కే మహిళా ప్రయాణికుల దృష్టి మరల్చి దొంగతనాలకు పాల్పడుతున్నారు. ముఠా నాయకుడు సందీప్ గతంలో హైదరాబాద్, ఆదిలాబాద్, విశాఖపట్నం జిల్లాలో 5 దొంగతనం కేసుల్లో పట్టుబడి జైలు కెళ్లొచ్చాడు. నిందితుల నుంచి కియా కారు, 10 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుని, కోర్టులో హాజరుపర్చనున్నట్లు డీఎస్పీ వెల్లడించారు.