Junior colleges | హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ప్రభుత్వ, కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో ధ్యానం, యోగా, రిలాక్సేషన్ ఎక్సర్సైజులను ప్రవేశపెట్టాలని ఇంటర్ విద్యాశాఖ ఆదేశించింది. ఈ మేరకు బుధవారం ఇంటర్ విద్య కమిషనర్ నవీన్మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. వీటిని అన్ని కాలేజీ యాజమాన్యాలు తప్పనిసరిగా అమలు చేయాలని పేర్కొన్నారు. విద్యార్థుల, శారీరక, మానసిక శ్రేయస్సు కోసం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇంటర్ కాలేజీల్లో విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు ఈ మేరకు చర్యలు చేపట్టినట్టు చెప్పారు. విద్యార్థుల్లో ఒత్తిడి, ఆందోళనను దూరం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకొన్నట్టు తెలిపారు.