హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. మరో వారం రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత నమోదయ్యే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈనెల 19 నుంచి 24 వరకు రాష్ట్రవ్యాప్తంగా 45 నుంచి 47 డిగ్రీల వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొన్నది. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం శనివారం సాయం త్రం బలహీనపడింది. రానున్న రెం డు, మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియన్ సముద్రంలోని మరికొన్ని ప్రాం తాలు, నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, అండమాన్ సము ద్రం, అండమాన్ నికోబార్ దీవుల్లోని మిగిలిన ప్రాంతాలు, తూర్పు బంగాళాఖాతంలోని కొన్ని ప్రాం తాల్లోకి ప్రవేశించడానికి అనుకూలంగా ఉన్నాయని అధికారులు తెలిపారు.
రాష్ట్రంలోని ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాలకు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీచేసింది. మరో 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది. రాష్ట్రంలో ఆదివారం నిర్మల్ జిల్లా తానూర్లో అత్యధికంగా 45.8 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా థారోజ్లో 45.5, నిజామాబాద్ జిల్లా భీంగల్లో 45.3 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. గతేడాది మేతో పోలిస్తే 4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదైనట్టు అధికారులు తెలిపారు.