రంగారెడ్డి, మార్చి 21 (నమస్తే తెలంగాణ): లంచం తీసుకుంటూ రంగారెడ్డి జిల్లా తూనికలు, కొలతల శాఖ ఇన్స్పెక్టర్ సింగబోయిన ఉమాదేవి, సీనియర్ అసిస్టెంట్ డీ మల్లేశం గురువారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరులోని నాట్కో ఫార్మా కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ బరువు కొలిచే మెషీన్ల స్టాంపింగ్, గడువు సర్టిఫికెట్ కోసం తూనికలు, కొలతల శాఖ ఇన్స్పెక్టర్ ఉమాదేవి ఒక్కో మెషీన్కు రూ.400 చొప్పున 25 మెషీన్లకు రూ.10వేలు లంచం డిమాండ్ చేశారు.
బాధితుడు గిరిధర్రావు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈ మేరకు గురువారం లంచం డబ్బులను గిరిధర్రావు నుంచి సీనియర్ అసిస్టెంట్ మల్లేశం ద్వారా తీసుకుంటుండగా ఇన్స్పెక్టర్ ఉమాదేవితోపాటు మల్లేశంను ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. వారిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు.