రాజన్న సిరిసిల్ల : తమ భూమిని అధికారులు వేరే వాళ్ల పేర పట్టా జారీ చేశారని ఆరోపిస్తూ ఓ మహిళ రుద్రంగి మండల తహశీల్దార్ ఆఫీస్ గేట్కు తాళి కట్టిన విషయం తెలిసిందే. కాగా, ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ సీరియస్ అయ్యారు. దీనిపై విచారణ అధికారిగా సిరిసిల్ల ఆర్డీవో శ్రీనివాస్ను నియమించారు. వెంటనే క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి వాస్తవ వివరాలతో సమగ్ర రిపోర్ట్ గురువారం సాయంత్రంలోగా అందజేయాలని ఆర్డీవోను అదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో ఆర్డీవో క్షేత్ర స్థాయిలో బాధితులు, అధికారులతో మాట్లాడారు.
2018లో పట్టామర్పిడి జరిగినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించారు. దానిపై క్షుణ్ణంగా విచారణ జరుపుతున్నారు. నివేదిక ఆధారంగా బాధ్యులపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోనున్నారు.
ఇవి కూడా చదవండి..
ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తా : ఎమ్మెల్యే పట్నం
పల్లె ప్రగతిలో ప్రజల భాగస్వామ్యం పెరగాలి
వెదజల్లే పద్దతిలో వరి సాగుతో అధిక లాభాలు : మంత్రి హరీశ్ రావు
బైక్ అదుపుతప్పి కల్వర్టులో పడి వ్యక్తి మృతి